59. 85శాతం రిజర్వేషన్ లు చట్ట విరుద్ధం హైకోర్టు తీర్పు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి లకు 34 శాతం రిజర్వేషన్ లు ఆ రిజర్వేషన్ లు వీలు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ లోని 9(1ఏ ),15(2),152(1ఏ ),153(2ఏ ),180(1ఏ ),181(2బి )చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టంచేసింది.
- మొత్తం రేజర్వేషన్లు 50శాతానికి మించడానికి వీల్లేదని పేర్కొంది .
- 50శాతానికి మించి కోటా ఇవ్వడం సుప్రీమ్ కోర్ట్ పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను వ్యతిరేకమని స్పష్టం చేసింది .
- రేజర్వేషన్లు 50శాతానికి లోబడి తిరిగి నిర్ణయించేందుకు ప్రభుత్వానికి నెల రోజులు సమయమిచ్చింది .
- స్థానిక సంస్థల ఎన్నిక విషయంలో ఎస్సి (19. 08శాతం ) ఎస్టీ ,(6. 77 శాతం ) బిసి (34 శాతం )రిజర్వేషన్ లు 59. 85శాతంగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ డిసెంబర్ 28 వ తేదీన జారీ చేసిన జీవో 176 తో పాటు జీవో 176తో పాటు జీవో కు అనుగుణంగా తీసుకున్న చర్యలన్నింటిని రద్దు చేసింది
- స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంలో ఇప్పటికే ఏడాదిన్నర జాప్యం జరిగింది అని గుర్తు చేసింది .
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె కె మహేశ్వరి ,జస్టిస్ ఎన్ జయసూర్య లతో కూడిన ధర్మాసనం మార్చ్ 2 వతేది ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది .
No comments:
Post a Comment