ఆర్ టి సి లో 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
ఆర్ టి సి లో 5 వేల మంది ఐ టి ఐ అప్రెంటిస్ ల నియామకానికి ఏ పి ఎస్ ఆర్ టి సి చర్యలు ప్రారంభించింది .
ఏప్రిల్ 15 కల్లా ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు ఫిబ్రవరి 8 వ తేదీ ఒక ప్రకటనలో తెలిపింది .
రాష్ట్రంలో నాలుగు జోన్లు కడప ,నెల్లూరు విజయనగరం ,,విజయవాడ , లకు డీజిల్ మెకానిక్ లు 3160
మోటార్ మెకానిక్ లు 200
ఎలెక్ట్రిషియన్ లు 560
వెల్డర్లు 160
పెయింటర్లు 320
మిల్ రైట్ మెకానిక్ లు 52
మెషినిస్టులు 16
షిట్ మెటల్ వర్కర్లు 520
సివిల్ డ్రాఫ్ట్ మెన్ లు 12 మందికి అవకాశం ఉందని ఆ ప్రకటనలో వెల్లడించింది .
అర్హత కలిగిన ఐ టి ఐ అభ్యర్థులు తమ దరఖాస్తులను సంస్థ వెబ్ సైట్ లో ఈ నెల 21 వ తేదీ లోపు సమర్పించాలని కోరింది . ఆయా జోన్లవారీగా ధ్రువ పత్రాల పరిశీలన ఏప్రిల్ 9 న నిర్వహిస్తామని 13 న ఎంపికైన అభ్యర్థుల జాభితా ప్రకటించి వారిని 15 న రీజియన్ వర్క్ షాప్ లకు కేటాయిస్తామని తెలిపింది .
No comments:
Post a Comment