రైల్వే రిజర్వేషన్ కౌంటర్లమూసివేత ఏప్రిల్ 14 వరకు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రైల్వే స్టేషన్ కౌంటర్లను ఏప్రిల్ 14 వరకు పూర్తిగా మూసివేయాలని రైల్వే శాఖ మార్చ్ 25 ఉత్తర్వులు జారీ చేసింది .
ఏప్రిల్ 15 వ తేదీ తర్వాత చేసే ప్రయాణాల కోసం ఈ టిక్కెటింగ్ ద్వారా మాత్రమే ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది
ఆ టికెట్స్ కోసం కౌంటర్ల వద్ద బారులు తీరే ప్రమాదం ఉండటంతో తాజా నిర్ణయం తీసుకుంది .
ఏప్రిల్ 14 తేదీ అర్ద రాత్రి 12 గంటల వరకు ప్రయాణాల కోసం ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల టికెట్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది .
కౌంటర్లలో ,ఆన్ లైన్ లో తీసుకున్న అన్ని టికెట్స్ కు ఇది వర్తింస్తుందని తెలిపింది.
No comments:
Post a Comment