దేశంలోనే తోలిసారిగా బాలల పార్కు ఆంధ్రప్రదేశ్
- దేశంలోనే తొలిసారిగా ఆల్ ఎబిలిటీ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు అయ్యింది .
- దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయబోతున్నారు .
- పార్కు అంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు . చెంగు చెంగున అక్కడున్నవన్నీ ఎక్కేస్తూ అలుపు సొలుపూ లేకుండా ఆడేస్తారు .
- అందుకే ఎలాంటి పిల్లలయినా ఆడుకోగలిగేలా ఓ పార్కును విశాఖపట్నంలో కట్టేశారు .
- ఆర్ కె బీచ్ రోడ్ లో ఆల్ ఎబిలిటీ చిల్డ్రన్ పార్క్ పేరుతో స్మార్ట్ సిటీ మిషన్ కింద దేశంలోనే తొలిసారిగా 3కోట్ల తో ఏర్పాటు చేశారు .
- దీన్ని చూసి కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ ఉన్నత అధికారులు ఫిదా అయ్యారు .
- దేశ వ్యాప్తంగా అన్ని ఆకర్షణీయ నగరాల్లోనూ ఇలాంటి పార్కులను నిర్మించేందుకు వెంటనే ప్రణాళికలు రూపొందించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు .
- దివ్యాంగులు చక్రాల కుర్చీలో కూర్చునే పార్కు నంత చుట్టొచ్చేలా ,సుమారు 10 అడుగుల ఎత్తు నుంచి బీచ్ అందాలు చూసేలా ప్రత్యేక పై బాట నిర్మించారు .
- వీరి కోసం ప్రత్యేక ఊయల ఏర్పాటు చేశారు .
- పిల్లలకు బోటులో వెళ్లే అనుభూతి వచ్చేలా పెద్ద బొమ్మ నౌకను ,అందులో నే పిల్లలు అమాంతం ఎగిరి ఆడుకొనే లా వలను ఏర్పాటు చేశారు .
- ఆడుకుంటూ పిల్లలు కింద పడ్డా దెబ్బ తగలకుండా పార్క్ మొత్తం రబ్బర్ ఫ్లోరింగ్ అమర్చారు . పచ్చికతో ముస్తాబు చేశారు .
- చూపు లేని పిల్లలు శబ్దాల ద్వారా ఆనందించే ఆటవస్తువులు ఇక్కడ ఉన్నాయి
- ఒక వైపు మాట్లాడితే మరొక వైపు నుంచి ఇంకొకరు వినేయవచ్చు .
No comments:
Post a Comment