దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పదోన్నతుల్లో దివ్యాంగులకు 4శాతం రేజర్వేషన్లు కల్పిస్తూ ఫిబ్రవరి 19 వతేది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .
ప్రస్తుతం అమలు అవుతున్న 3శాతం రిజర్వేషన్లు 4శాతానికి పెంచింది .
నియామకాలకు సంబంధించి అంధత్వం ,కంటిచూపు మందగించినవారికి 1 శాతం
వినికిడి లోపం ఉన్నవారికి 1శాతం
చలన సంబంధ వైకల్యం కండరాల బలహీనత ,మస్తిష్క పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తుల మరగుజ్జుతనం , యాసిడ్ బాధితుల 1శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు .
ఆటిజం లెర్నింగ్ డీసెబిలిటీ తో బాధపడేవారికి 1శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు .
5 గురుకి మించి సిబ్బంది ఉన్న ఏ శాఖలో అయినా పదోన్నతులోను ఇవే రిజర్వేషన్లు వర్తింప చేస్తారు .
No comments:
Post a Comment